కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం 

  ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

చిత్తూరు: గుమ్మం లోపలే ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలంటూ  ఎమ్మెల్యే రోజా ట్వీట్లు చేశారు. 'కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో యుద్ధం చేస్తున్నాం. ఈ సంగ్రామంలో మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్స్ మాత్రమే. గుమ్మం లోపలే ఉందాం.. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం. ఇంటి వద్దనే ఉండండి' అని రోజా ట్వీట్ చేశారు.
 
డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్
'మన ప్రాణాలను కాపాడేందుకు కుటుంబాన్ని సైతం వదిలి సేవలందిస్తున్న డాక్టర్ దేవుళ్లకు సెల్యూట్. ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు' అని ఆమె మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top