ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు:  ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబును నిందితుడిగా చేర్చాల‌ని మంగ‌ళ‌గిరి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి డిమాండు చేశారు. బుధ‌వారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

  • ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు
  • 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది
  • 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను
  • గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు
  • రేపు కేసు విచారణ జరగబోతుంది
  • అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది
  • ఏడేళ్లయినా విచారణ  జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా?
  • ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు
  • తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు
  • అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి 
  • ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి
  • ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి
  • మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు
  • అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు
  • ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది
  • ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు
  • ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు
  • రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు
  • నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు
  • నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు
  • అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది
  • ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు
  • ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి
  • ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి.
  • అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు
  • కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది
  • ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు
  • రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు
Back to Top