‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమంలో ముందడుగు
19 Dec 2020 4:54 PM
ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్దే
ఈనెల 25న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం
మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు
గుంటూరు: ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అమలు చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్దేనన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రూ.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, విడదల రజిని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్దన్నారు. కరోనా సమయంలో కూడా సీఎం జగన్ ప్రజలను ఆదుకున్నారని, గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుకూల మీడియాతో పథకం ప్రకారం ప్రభుత్వంపై బురదచల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ఈనెల 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని వివరించారు.