రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
శ్రీవారి ఆశీస్సులతో సీఎం సంకల్పం సిద్ధించాలి
23 Dec 2020 1:17 PM
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
తిరుపతి: పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ప్రతిష్టాత్మకమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పం సిద్ధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. శ్రీవారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరగాలన్నారు.