నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
ప్రజలంతా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి
07 Apr 2020 12:24 PM
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు
పశ్చిమగోదావరి: లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రజలంతా స్వీయ గృహ నిర్భంధంలోనే ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు సూచించారు. పెనుగొండలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. జిల్లాలోని పెనుమంట్ర మండలంలోని ఎస్ ఇల్లింద్రపర్రు, ఆలమూరు, నెలమూరు, ఓడూరు, పొలమూరు గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వైద్య సదుపాయాలను ఆయన పరివేక్షించారు. అనంతరం మంత్రి రంగనాధరాజు మాట్లాడుతూ.. ప్రజలెవరూ బయట తిరగవద్దని కోరారు. పంటలు చేతికి వస్తున్న తరుణంలో రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, రూ.1000 ఆర్థిక సాయం గురించి వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.