కార్మిక సంక్షేమమే లక్ష్యం

బాధ్యతలు చేపట్టిన మంత్రి గుమ్మనూరు జయరాం
 

 అమరావతి: కార్మిక సంక్షేమమే తన లక్ష్యమని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దైవ సంకల్పం, మా నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆశీర్వాదంతో ఈ పదవీ బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తానని పేర్కొన్నారు. 
 

Back to Top