ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
కొత్త పారిశ్రామిక పాలసీ సిద్ధం
27 Feb 2020 12:27 PM
విశాఖలో 50 వేల ఐటీ ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ రంగంలో మరో 50 వేల ఉద్యోగాలు
3 పోర్టుల ఏర్పాటుకు సీఎం వైయస్ జగన్ నిర్ణయం
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పాలసీని సిద్ధం చేశామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. మార్చిలో కొత్త పారిశ్రామిక పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. చంద్రబాబు హయాంలో వదిలేసిన పరిశ్రమలను కూడా తెస్తున్నామని చెప్పారు. పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోమని కియా మోటార్స్ చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలో ఒక్క విశాఖలోనే 50 వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. పరిశ్రమల కోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. 3 పోర్టులను ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి గౌతంరెడ్డి వివరించారు. పరిశ్రమలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 75 శాతం స్కిల్ మాన్ పవర్ ఇస్తున్నామని చెప్పారు. సులువుగా పెట్టుబడులు పెట్టేందుకు సవరణలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.