సమర్థ నాయకులు సీఎం వైయ‌స్‌ జగన్ 

ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు

నాన్ లోకల్ చంద్రబాబు, నాన్ లోకల్ లోకేశ్,పవన్ ను జనం నమ్మరు

సీఎం జన్మదిన వేడుకల్లో మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు

గారలో మొక్కలు నాటి, కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న మంత్రి

శ్రీ‌కాకుళం: పదేళ్లు అవుతుంది రాష్ట్రం విడిపోయి, హైద్రాబాద్ వదిలి చంద్రబాబు, పవన్ ఏపీ ఎందుకు రారు ?  ఎందుకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోరు ? అని మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. పొలిపల్లి సభలో మాట్లాడిన వారెవ్వరికీ ఏపీలో స్థిర నివాసం అంటూ ఏదీ లేదని, వాళ్లంతా నాన్ లోకల్స్ అని, పొరుగు రాష్ట్రం నాయకులం తా ఇటుగా వచ్చి తమకు ఓటేయమంటున్నారని ? ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలని మంత్రి ధర్మాన అన్నారు. ఇదే విధంగా పొరుగు రాష్ట్రాలు అయిన ఏ ఒడిశా నుంచో ఏ తమిళ నాడు నుంచో నాయకులు వచ్చి పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతామంటే ఒప్పుకుంటామా ? ఇక్కడ చంద్రబాబు కానీ లోకేశ్ కానీ పవన్ కానీ ఎవ్వరూ లోకల్ నాయకులు కాదు అని.. వారేం చెప్పినా అవేవీ నమ్మశక్యం కావని అన్నారు. 

ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకుని,జనం అందరి మెప్పునూ పొందిన సమర్థ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం,ఎంపీడీఓ కార్యాలయం వద్ద సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా..మంత్రి ధర్మాన మాట్లాడుతూ..పేదలందరికీ మంచి చేయాలన్న తపన ఉన్న నాయకుడు జగన్. అన్ని వర్గాలకూ మంచి చేస్తున్న ఏకైక నేత జగన్. పేదలకు మంచి జరగకూడదు అని విపక్షాలు విష ప్రచారం చేస్తూ ఉన్నాయి. పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ట్యాబ్ లు అందజేస్తున్నాం. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ బై జూస్ కంటెంట్ ను అందిస్తున్నాం. ఈ కంటెంట్ ద్వారా విద్యార్థులు తమ అంతర్గత నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. అలానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న స్టడీ మెటీరియల్ అందుకుని పోటీ ప్రపంచంలో ఆశించిన ఫలితాలు సాధించి తలెత్తు కోవచ్చు. రాణించవచ్చు. పిల్లలకు ట్యాబ్ లు ఇస్తే పాడయిపోతున్నారు అంటూ ఈనాడు కథనాలు వేస్తున్నారు.

పిల్లలకు ఇస్తున్న వాటిలో అవసరం అయిన వాటినే ఉంచి,మిగిలిన వాటిని బ్రౌజ్ చేయకుండా అని ట్యాబ్ లను లాక్ చేసి ఇస్తున్నారు. ఇది తెలిసి కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు. ఇవాళ ఆధునిక కాలంలో అంతా దూసుకుపోతున్నారు. వారితో పాటే ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థికి అవసరమైన విజ్ఞాన విషయాలు అందించేందుకు ట్యాబ్ లు అందిస్తుంటే ఈనాడు పత్రిక విలేకరులు తప్పుడు రాతలు రాస్తున్నారు. సమాజంలో నెలకొన్న హెచ్చు,తగ్గులు తగ్గించడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు.

విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగిపోతాయి అని జగన్ విశ్వసిస్తున్నారు. అలానే వైద్య భారం కాకూడదు అని 
ఆ రోజు ఉన్న ఆరోగ్య శ్రీ కార్డు విలువను రూ.5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచారు. పేదలకు వైద్యం భారం అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కార్డు తో పది లక్షల రూపాయల వరకూ మాత్రమే వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా 25 లక్షల వరకూ కార్పొరేట్ వైద్యం అందుకునే అవకాశం మన ప్రియ ముఖ్యమంత్రి అందించారు. సీఎం అయిన మొదటి రోజు నుంచి చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వస్తున్నారు. పూర్వం వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉండేది.
నాడు వైయ‌స్ఆర్,నేడు జగన్ వైద్యానికి పెద్ద పీట వేస్తుండడంతో ఆనాటి పరిస్థితులు అన్నీ మారిపోతూ వస్తున్నాయి. మీరంతా ఆ రోజు నాలుగున్నరేళ్ల కిందట  ఓటు వేసి అధికారం ఇచ్చారు కనుకనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఇంత మంచి చేస్తుంటే.. కళ్లూ.,ఒళ్లూ మండిపోతున్నాయి ప్రతిపక్షాలకు. నిస్సహాయులు కు తోడుగా ఉంటే..తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. జన్మభూమి కమిటీల పేరిట ఊళ్లో నలుగురు దొంగలను తయారు చేసి ఆ దొంగలు దోచుకుతినేందుకు ఆస్కారం ఇచ్చారు. 

పదేళ్లు అవుతుంది రాష్ట్రం విడిపోయి, హైద్రాబాద్ వదిలి చంద్రబాబు ఏపీ ఎందుకు రారు ?  ఎందుకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోరు ? 
పోలిపల్లి సభలో మాట్లాడిన వారు ఎవరైనా ఆంధ్ర ప్రదేశ్ లో నివాసం ఉందా.. ? హైద్రాబాద్ లో వ్యాపారాలు, సినిమాలు చేస్తున్నారు వారు ఉపన్యాసాలు ఇస్తారు.పక్క రాష్ట్రాల్లో ఉండే వారిని ఎందుకు ఓటు వేయాలి, వారిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి. ఇదే రాష్ట్రానికి ఒడిశా వారో,తమిళనాడు వారో వచ్చి పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతామంటే మనం ఓటు వేస్తామా ?  ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి. వాళ్లంతా నాన్ లోకల్. ఈ రోజు ప్రతి కుటుంబానికీ తోడుగా ఈ ప్రభుత్వం  ఉంది అని నమ్మకం కలిగించాం. అనుకున్న విధంగా హామీలు నెరవేర్చాం. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పని ఇది. ప్రజలంతా వీటిని గమనించాలి. అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

డిసిఎంఎస్ చైర్మన్ గొండు రఘురాం, ఎంపిడివో, ఎమ్మార్వో, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పీస గోపి, చిట్టి జనార్ధన రావు, జడ్పీటీసీ రుప్పా దివ్య, మార్పు ధర్మ రావు,  నాటక అకాడమీ డైరెక్టర్ ముంజెటి కృష్ణ, కోయ్యాన నాగభూషణం, అరవల  రామ కృష్ణ, మధు రెడ్డి, బుడ్డా ఎర్రన్న, మార్పు దుర్గ ప్రసాద్, మార్పు మనమధ రావు, అరంగి అప్పల నాయుడు, మోషన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top