మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
గవర్నర్ ప్రసంగాన్ని స్వాగతిస్తున్నాం
17 Jun 2019 2:35 PM
అవినీతి రహిత పాలనే ధ్యేయంగా సీఎం జగన్ మొదటి అడుగు
డిప్యూటీ సీఎం,మైనారీటి సంక్షేమ మంత్రి అంజాద్ బాషా
అమరావతిఃగవర్నర్ ప్రసంగం రోటిన్గా లేకుండా భిన్నంగా ఉందని డిప్యూటీ సీఎం,మైనారీటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికి నీతివంతమైన, పారదర్శక పాలన వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. దేశం,రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయింందని..ఇలాంటి తరుణంలో సూర్యకిరణంగా,అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పడం స్వాగతిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించే దిశలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి మొదటి అడుగు వేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం జీవో ద్వారా సీబీఐని రాష్ట్రంలోకి రాకూడ చేయడం దారుణమన్నారు. సీఎం జగన్ మొదటి నిర్ణయం ద్వారా సీబీఐ వ్యవస్థను రాష్ట్రంలో పునర్వివ్యవస్థీకరించడం జరిగిందన్నారు.అవినీతి జరిగితే సిబీఐ ద్వారా విచారణ జరిపిస్తామని తెలిపారు.