కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
చింతమనేనిపై చర్యలు తీసుకోండి
22 Feb 2019 12:37 PM
ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసిన మేరుగ నాగార్జున
ఏలూరు: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చింతమనేని ప్రభాకర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్లో దళితులను ఉద్దేశించి చింతమనేని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీన్ని వైయస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండించింది. గతంలో చంద్రబాబు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని కించపరిచేలా మాట్లాడారు. చంద్రబాబు దారిలో తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆదినారాయణరెడ్డి, తాజాగా చింతమనేని ప్రభాకర్ దళితులను అడుగడుగునా అవమానపరుస్తూ వస్తున్నారు.