వైయస్‌ఆర్‌సీపీ ముఖ్య నేతల సమావేశం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు మేరుగు నాగార్జున, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలువురు ఎస్సీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 
 

Back to Top