ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
తిరుపతి లోక్సభ నియోజకవర్గ కుటుంబాలకు సీఎం వైయస్ జగన్ లేఖ
08 Apr 2021 4:45 PM
తొలి లేఖపై సంతకం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్
22 నెలల సంక్షేమ, అభివృద్ధి పాలనను వివరిస్తూ ఉత్తరం
తాడేపల్లి: తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. 22 నెలల పరిపాలనా కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును గురించి ఈలేఖలో వివరించారు. ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతకం చేశారు.
కుటుంబంలోని సోదరుడు లేదా అక్కచెల్లెమ్మకు ఈ లేఖను నేరుగా రాశారు. వైయస్ఆర్ సున్నావడ్డీ, వైయస్ఆర్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈలేఖల్లో ప్రస్తావించారు.
22 నెలల పరిపాలనలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని తెలియజేశారు. సీఎం వైయస్ జగన్ రాసిన ఉత్తరం ఇంతకుముందు రాజకీయ సంస్కృతికంటే భిన్నంగా సాగింది. తిరుపతి ఉప ఎన్నికలో ఫ్యాను గుర్తుపై ఓటువేసి వైయస్ఆర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలంటూ ఆయా కుటుంబాలను లేఖల ద్వారా అభ్యర్థించారు. ఈ లేఖలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా కుటుంబాలకు అందిస్తుంది.