తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారు

 తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి

తిరుపతి: ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్‌ చేశారు. టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమ‌న్నారు. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడ‌ని మండిప‌డ్డారు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్‌కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.  

రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త ప్రకటించి ఉండాలి. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారు. తండ్రీకొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని ల‌క్ష్మీపార్వ‌తి వ్యాఖ్యలు చేశారు. 
 

Back to Top