కర్నూలు కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: కర్నూలు న‌గ‌రానికి చెందిన‌ కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు ఇవాళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్‌ సమక్షంలో  ప‌లువురు కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. పీజీ రాంపుల్లయ్య యాదవ్‌ (లక్కీ2) (కర్నూలు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి), మోనికా రెడ్డి (51 డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌), నరసింహులు యాదవ్‌ (స్టాండింగ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌), లోక్‌నాథ్‌ యాదవ్‌ (డీసీసీబీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌), ప్రదీప్‌ వెంకటేష్‌ యాదవ్‌ (మాజీ రైల్వే బోర్డ్‌ మెంబర్‌), షబ్బీర్‌ అహ్మద్‌, ఫైరోజ్‌ (8 వ డివిజన్‌ టీడీపీ నాయకులు)ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో  కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్‌ వి మోహన్‌ రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ వైయ‌స్ఆర్‌సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, కర్నూలు సిటీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ అలీఖాన్‌, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Back to Top