గుంటూరు: టీడీపీ ఉనికి కాపాడుకోవడానికి వైయస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై రైతుల ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో మహిళలను ముందుపెట్టి టీడీపీ గుండాలు బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, భూముల విలువలు తగ్గిపోతాయన్న బాధతోనే.. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు వసూళ్లు చేసి మరీ రాజధాని పేరుతో దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా రోజుకోరకంగా తప్పుడు ప్రచారం చేస్తూ కుయుక్తులు పన్నుతున్నారు. మీరెన్ని కుయుక్తులు పన్నినా మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజిని, నందిగం సురేష్లపై దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా భావిస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే టీడీపీ నేతలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.