నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
డేటా చోరీపై అసెంబ్లీలో మధ్యంతర నివేదిక
20 Sep 2022 12:11 PM
అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన డేటా చోరీపై అసెంబ్లీలో మధ్యంతర నివేదికను హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలని భూమన కోరారు. టీడీపీ సేవా మిత్ర యాప్ను దుర్వినియోగం చేసిందని చెప్పారు. సేవా మిత్ర యాప్ ద్వారా 30 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది..డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. డేటా దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నామని తెలిపారు.
వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని దుర్వినియోగం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి సభలో చెప్పారు. నాలుగుసార్లు చర్చించాం. వివిధ శాఖల అధిపతుల్లో చర్చించాం. సంబంధిత అధికారులతో భేటీ అయ్యాం. 25-3-22న సభ హౌస్ కమిటీ వేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకమయిన లబ్ధి జరగడానికి అవకాశం వచ్చింది. యాప్ ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తీసుకుని తమకు ఓటెయ్యని వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఈ డేటా చౌర్యానికి సంబంధించి మరింత మందిని విచారించాలి. మధ్యంతర నివేదికను సభ ముందుకి తెచ్చాం. చౌర్యం చేసిన వారిని పట్టుకోవాలి. నూటికి నూరుశాతం చౌర్యం చేశారని సభా సంఘం నిర్దారించిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.