గుంటూరు: జిన్నా టవర్ మువ్వన్నెల రంగులతో ముస్తాబైంది. జిన్నా టవర్ సెంటర్ వద్ద ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు, గుంటూరు నగర ప్రజలు పాల్గొన్నారు.