బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
కాసేపట్లో సీఎం వైయస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
23 Apr 2021 3:15 PM
కోవిడ్ కట్టడిపై మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం
తాడేపల్లి: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నివేదికను మంత్రులు సీఎం వైయస్ జగన్కు అందించనున్నారు. పూర్తిస్థాయిలో కోవిడ్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై ఈ ఉన్నతస్థాయి సమీక్షలో చర్చించనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.