చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
హెల్త్ కార్డుల డిజిటలైజేషన్లో ఏపీకి ప్రథమస్థానం
26 Aug 2022 5:23 PM
అవార్డును సీఎం వైయస్ జగన్ అందించిన మంత్రి రజని
వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ద ఎకనమిక్ టైమ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన డిజిటెక్ కాన్క్లేవ్ 2022లో పాల్గొని, ప్రజల హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో దేశంలోనే ప్రథమ స్ధానంలో నిలిచినందుకు రాష్ట్రానికి వచ్చిన అవార్డును మంత్రి విడదల రజని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన అవార్డుని ముఖ్యమంత్రి వైయస్ జగన్కు మంత్రి రజని చూపించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సీఎం వైయస్ జగన్ అభినందించారు.