వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రతీ హామీ అమలు..
25 Jan 2023 12:55 PM
ఎంఎం హళ్లిలో `గడప గడపకు మన ప్రభుత్వం`లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి
ఉరవకొండ: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని ఉరవకొండ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కూడేరు మండలం ఎంఎం హళ్లి గ్రామంలో `గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడపకు వెళ్లి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. లబ్ధిదారులతో కలిసి సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా.. చెప్పని హామీలను కూడా సీఎం వైయస్ జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు. కుల, మత, ప్రాంత, వర్గ, చివరకు పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.