కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఈ -రక్షా బంధన్కు విశేష స్పందన
04 Aug 2020 3:50 PM
ఒక్క రోజే 67 వేల మంది ఎల్రోల్
తాడేపల్లి: రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 3వ తేదీ లాంఛనంగా ప్రారంభించారు. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ -రక్షా బంధన్ ప్రారంభించిన ఒక్క రోజులోకే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ ఈ-రక్షా బంధన్ యూట్యూబ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఒక్క రోజులోనే 67 వేల మంది ఎన్రోల్ చేసుకున్నట్లు సీఐడీ ఎస్సీ రాధిక తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని మంచి ప్రతిస్పందన లభిస్తోందని ఆమె చెప్పారు. మొదటి రోజు శిక్షణలో ఆన్లైన్ సేఫ్పై అవగాహన కల్పించామన్నారు. సైబర్ నేరగాళ్ల కదిలికలపై నిఘా పెట్టామని రాధిక తెలిపారు. 4 ఎస్, 4 యూ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి విషయంలో గోప్యత పాటిస్తామని ఎస్పీ వెల్లడించారు. 9071666656 వాట్సాప్ నంబర్కు వివరాలు పంపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాధిక వెల్లడించారు.