కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సీఎం వైయస్ జగన్ను విమర్శించే అర్హత బాబుకు లేదు
07 Sep 2019 4:15 PM
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఫైర్
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఫైర్ అయ్యారు. వందేళ్లైనా జరగవేమోనన్న నిర్ణయాలు వైయస్ జగన్ వంద రోజుల్లోనే చేశారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్లుగా సీఎంగా ఉండి చేయని సంస్కరణలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల్లోనే చేశారని పేర్కొన్నారు.వంద రోజుల్లోనే లక్షా 33 వేలు ఉద్యోగాలిచ్చిన ఏకైక సీఎం వైయస్ జగన్ అని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ది అని పేర్కొన్నారు. బాబు కలలో అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం ఆలోచించారా అని ప్రశ్నించారు. పునరావాస కేంద్రాలని డ్రామాలాడుతున్న చంద్రబాబు నారాయణ కాలేజీల్లో 25 మంది ఆడపిల్లలు చనిపోతే ఎందుకు పెట్టలేదని నిలదీశారు.