ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక

అమరావతి: శాసనమండలి సభ్యుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇతర పార్టీల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్‌ వేయలేదు. దీంతో ఎన్నిక నామినేషన్ల గడువు ఈ రోజు మధ్యాహ్నంతో ముగియడంతో డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. 

Back to Top