తెల్లవారు జాము నుంచే ‘వైయ‌స్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ

 అమరావతి:  రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జాము నుంచే ‘వైయ‌స్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ  ప్రారంభమైంది. 59.18 లక్షల మంది పెన్షనర్లకు రూ.1,382.63 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్‌డీఏ కాల్‌ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లబ్ధిదారులకు బయోమోట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది.

Back to Top