ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
అభివృద్ధి - సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
04 Jan 2023 1:02 PM
విజయనగరం: అభివృద్ధి, సంక్షేమమే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రజలకు అందించిన అభివృద్ధి -సంక్షేమ పాలనతో సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విజయనగరం 43వ డివిజన్ ఆర్టీసీ కాలనీ లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం వైయస్ జగన్ ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్లాగా భావించి, అందులోని 98 శాతం హామీలను మూడేళ్లలోనే నెరవేర్చారన్నారు. జనవరి 1వ తేదీన పింఛన్ సొమ్ము రూ.2750లకు పెంచి మరో మాటను సీఎం వైయస్ జగన్ నిలబెట్టుకున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేసి ఇల్లు కట్టుకునే విధంగా ఆర్థిక చేయూత అందజేస్తున్నామన్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు -ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చామని వివరించారు.