కాసేపట్లో ‘స్పందన’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

కోవిడ్‌ కట్టడి చ‌ర్య‌ల‌పై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ‘స్పందన’పై సమీక్షా సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌పై కీలకంగా చర్చించనున్నారు. అదే విధంగా ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రారంభాలపై సమీక్షించనున్నారు. వైయస్‌ఆర్‌ రూరల్‌ – అర్బన్‌ క్లినిక్స్, వైయస్‌ఆర్‌ జలకళపై చర్చించనున్నారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ సన్నద్ధతపై, విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతులకు రుణ సౌకర్యాలపై చర్చిస్తారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలపై సమీక్షించనున్నారు.  

Back to Top