ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు ప్రధానితో సీఎం వైయస్ జగన్ సమావేశం కొనసాగింది. పీఎం కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు. మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు.