రేపు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ బయల్దేరుతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, పెండింగ్‌ బిల్లులు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు  జరపని విషయాన్ని ప్రధానితో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు.  
 

తాజా వీడియోలు

Back to Top