రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (12.04.2023) ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు.  వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం నగదు జమ చేయనున్నారు.

  • రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. 
  • 10.15 – 12.05 గంటలకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు.
  • బహిరంగ సభలో ప్రసంగం, అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్న సీఎం, 
  • కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
  •  

తాజా వీడియోలు

Back to Top