తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొననున్న సీఎం

అమరావతి: తుంగభద్ర పుష్కరాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 
 

Back to Top