రేపు కోవిడ్ వ్యాక్సిన్‌ ప్రక్రియ 

విజ‌య‌వాడ‌ జీజీహెచ్ కు‌ సీఎం వైయ‌స్‌ జగన్‌
 

 విజయవాడ:  రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్ర‌క్రియ శ‌నివారం నిర్వ‌హించ‌నున్నారు. విజ‌య‌వాడ జీజీహెచ్‌లో  కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించనున్నారు. ఉదయం 11.30 గంటలకు జీజీహెచ్‌కు సీఎం రానున్నారు.  రేపు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి విడతలో రాష్ట్రంలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. రేపు విశాఖ, విజయవాడలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను  ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌ లైవ్‌లో వీక్షించనున్నారు.  

Back to Top