27న ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  ఈ నెల 27వ తేదీ గురువారం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ విడుద‌ల చేశారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి.

ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి, 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11.10 – మధ్యాహ్నం 1.10 గంటల వరకు నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top