22న సీఎం వైయ‌స్‌ జగన్‌ కుప్పం పర్యటన  

 చిత్తూరు జిల్లా : సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 22న కుప్పం రానున్నట్లు పార్టీ  వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్‌ స్థలాలను పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు నేతలు తెలిపారు.

Back to Top