తాడేపల్లి: నవంబర్ 1న (బుధవారం) ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. వైయస్ఆర్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డులు, ఎచీవ్మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో గవర్నర్, సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఉదయం 10.48 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు, అక్కడ జరగనున్న వైయస్ఆర్ లైఫ్టైం ఎచీవ్మెంట్ అవార్డులు, ఎచీవ్మెంట్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్, సీఎం, కార్యక్రమం అనంతరం సీఎం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు