`స్పంద‌న‌`పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్  ద్వారా వివిధ అంశాల‌పై స‌మీక్షించి.. క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ స‌మావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన్‌ రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ. ఆర్‌. అనురాథ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top