ఎన్‌పీఆర్‌పై ఆందోళన వద్దు

అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తాం
 

సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌

తాడేపల్లి: ఎన్‌పీఆర్‌ చట్టంపై  మైనారీటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం ట్వీట్‌ చేశారు. ఎన్‌పీఆర్‌లో ప్రతిపాదించడ్డ కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయి..ఈ అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిపాం. 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరతాం. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top