ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మ‌ర‌ణం ప‌ట్ల సీఎం వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి

సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం

అమ‌రావ‌తి:  పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం దుర్మరణం చెంద‌డ‌టం ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం తెలిపింది. కేబినెట్‌ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. 

Back to Top