రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
విశాఖ ట్రాఫిక్ ఆంక్షలపై సీఎం సీరియస్
10 Feb 2022 10:07 AM
ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారు..?
వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీకి సీఎం ఆదేశం
తాడేపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠం సందర్శనలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా.. నగరంలో గంటల తరబడి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై సీఎం వైయస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ ట్రాఫిక్ జామ్పై వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని అధికారులపై సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.