మ‌ద్యం వినియోగాన్ని బాగా నియంత్రించాం

ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సమీక్ష.

నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలి

ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి వ్యవహారాలు ఉండకూడదు

సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులకు కొత్తరూపు

ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలి

తాడేప‌ల్లి: బెల్టుషాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడంతో మ‌ద్యం వినియోగాన్ని బాగా నియంత్రించామని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. మ‌ద్యం రేట్లు షాక్‌ కొట్టేలా పెట్టడంతో వినియోగం గణనీయంగా తగ్గిందని సీఎం తెలిపారు.  నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని సీఎం ఆదేశించారు.  ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.  ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సీఎం  సమీక్షించారు.  లీకేజీలు లేకుండా, పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.  రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు.  2018–19తో పోలిస్తే లిక్కర్‌ అమ్మకాలు 384.31లక్షల కేసులు కాగా, ఇప్పుడు 2021–22లో 278.5 లక్షలకు తగ్గిందని అధికారులు తెలిపారు.  2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–22లో 82.6 లక్షల కేసులకు తగ్గిందని అధికారులు వివ‌రించారు.  2018–19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లుకాగా, 2021–22లో మద్యం విక్రయయాలపై ఆదాయం రూ. 25,023 కోట్లుగా ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.  గడచిన ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తంగా 20,127 కేసులు నమోదు చేశామని  అధికారులు తెలిపారు. ఇందులో 16,027 మందిని అరెస్టు చేయగా, 1,407 వాహనాలు సీజ్‌ చేశామన్న అధికారులు.
 నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు. 

  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమన్నారంటే... 
– నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని సీఎం ఆదేశం. 
– ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
– స్వయం ఉపాధి పెంచి, వారికి గౌరవ ప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు. 

– మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి. 
– ప్రతి కాలేజీ, యూనివర్శిటీల ముందు ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశం. ఎస్‌ఈబీ నంబర్‌తో బోర్డులు పెట్టాలన్న సీఎం. 
– ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి వ్యవహారాలు ఉండకూడదన్న సీఎం.
– కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. 

– గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందకు సాగాలన్న సీఎం
– జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను వారికి సూచించాలన్న సీఎం
– మంచి పంటలను సాగుచేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర సహాయ సహకారాలు వారికి అందించాలన్న సీఎం
– దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయిసాగుపై దాడులు నిర్వహించాలన్న సీఎం.
– ప్రభుత్వం నుంచి ఇప్పటికే వివిధ పంటలకు సంబంధించి విత్తనాలు అందించామన్న అధికారులు.
– ఇప్పటికే 2500 ఎకరాల్లో వేరే పంటలు సాగు చేశారని తెలిపిన అధికారులు.
– పండించిన పంటలను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపిన అధికారులు. 
– ఇంకా 1600 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు. 
– మిగిలిన చోట్ల ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే.. దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్న అధికారులు.
– గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగుచేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం ఆదేశాలు. 

– ఏసీబీకి సంబంధించిన 14400 నంబర్‌ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా కనిపించాలని సీఎం ఆదేశం. 
– దీనికోసం కచ్చితంగా బోర్డులు పెట్టాలన్న సీఎం. 
– గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ, పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎస్పీకార్యాలయం వరకూ, పీడీఎస్‌ షాపుల వద్ద కూడా ... ఈబోర్డులు కనిపించాలి : 
– అన్ని ప్రభుత్వ విభాగాధిపతులతో మాట్లాడి.. దీన్ని అమలు చేయాలని సీఎం ఆదేశాలు.
– సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులకు కొత్తరూపు ఇవ్వాలని సీఎం ఆదేశం.
– పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో వీటిని తీర్చిదిద్దాలన్న సీఎం.

– మైనింగ్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు పొంది, లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనులను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలన్న సీఎం.
– జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్స్‌లో ఉండేలా చూడాలన్న సీఎం
– ఒకవేళ ఆపరేషన్స్‌లో లేకపోతే కారణాలు కనుక్కొని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయాలన్న సీఎం.
– అన్ని అనుమతులూ పొంది ఆపరేషన్స్‌ చేయకపోతే ఆదాయాలు రావన్న సీఎం.

– ఎర్రచందనం విక్రయానికి అన్నిరకాల అనుమతులు వచ్చాయన్న అధికారులు.
– అక్టోబరు – మార్చి నెలల మధ్య 2640 మెట్రిక్‌ టన్నుల విక్రయానికి ప్రణాళిక సిద్ధంచేశామన్న అధికారులు.
– ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలన్న సీఎం.
- గ్రేడింగ్‌లో థర్డ్‌పార్టీచేత కూడా పరిశీలన చేయించాలన్న సీఎం.

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె నారాయణస్వామి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖమంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, అడిషనల్‌ డీజీ ఎ రవిశంకర్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top