గాడిలో రాష్ట్రం ఆదాయాలు

ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష

ఆశాజనకంగా ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఆదాయాల ప్రగతి.

94.47శాతం లక్ష్యం చేరిక.

దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ సగటు వసూళ్లు.

పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.

పారదర్శక, సులభతర విధానాలద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్న సీఎం.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు చేసిన సీఎం.

నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులకు సీఎం ఆదేశం

అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

రవాణా శాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్న సీఎం

తాడేప‌ల్లి: పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నామని పేర్కొన్నారు. ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని అధికారులు వివ‌రించారు. లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్యాక్స్‌ ఇన్ఫర్మేషన్ ,  ఇన్వెస్టిమెంట్‌ మేనేజిమెంట్‌ సిస్టంను అభివృద్ధి పరిచామని చెప్పారు. హెచ్‌ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని అధికారులు వివ‌రించారు. ఆదాయన్నిచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.  రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని వివరించిన అధికారులు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో ఆదాయాల ప్రగతిని వివరించిన అధికారులు.
జీఎస్‌టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:

  • ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలన్న సీఎం.
  • లీకేజీలను అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్‌ ఇనిస్టిట్యూట్‌ల సహాయం తీసుకోవాలన్న సీఎం.
  • పన్ను చెల్లింపు దారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలన్న సీఎం. 
  • గ్రామాల్లో మహిళా పోలీసులనుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలన్న సీఎం. 
  • బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం.
  • ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
  • నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
  • ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకు రావాలన్న సీఎం
  • దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం. 
  • అక్రమ మద్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • రిజిస్ట్రేషన్‌ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
  • ఈ కమిటీలో ఐఏఎస్‌అధికారులు కృష్ణబాబు, రజత్‌ భార్గవ, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలని సీఎం ఆదేశం.
  • రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలన్న సీఎం.
  • అలాగే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారికి సులభతర,  పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం. 
  • నాన్‌ రిజిస్ట్రేషన్‌ పరిస్థితులను పూర్తిగా తొలగించాలన్న సీఎం.
  • ఇందులో ప్రొఫెసనల్‌ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలన్న సీఎం.
  • ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలన్న సీఎం
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్‌ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలన్న సీఎం. 
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలన్న సీఎం. 
  • భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశం. 
  • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలన్న సీఎం. ఈ పోస్టర్లను అన్ని కార్యాలయాల్లో ఉంచాలన్న సీఎం. 
  • గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం కాగా, ఈ ఏడాది  సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం. 
  • మొత్తంగా 19శాతం పెరుగుదల. 
  • మొత్తం ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అంచనాగా తెలిపిన అధికారులు.
  • మైనింగ్‌ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు  పొందినవారు ఆపరేషన్‌ కొనసాగించేలా చూడాలన్న సీఎం. 
  • దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. 
  • ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
  • ఆపరేషన్‌ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలన్న సీఎం.
  • ప్రతినెలా కూడా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
  • లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్నదానిపై నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం. 
  • రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  • కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదని, వినూత్న ఆలోచనలు చేయాలన్న సీఎం.
  • పక్కరాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు తగిన సానుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉండేలా ఆలోచనలు చేయాలన్న సీఎం.
  • ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని డీలర్లు వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగుచూశాయన్న సీఎం.
  • దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న సీఎం.
  •  
  • ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ ) కె నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీపర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఎక్సైజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్, 
  • ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స  వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, కమర్షియల్‌ టాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top