కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ అత్యున్నతస్థాయి సమీక్ష

తాడేపల్లి: కరోనా నివారణపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరయ్యారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని సూచించారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునేలా మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

Back to Top