కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కడప స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై సీఎం సమీక్ష
15 Jun 2020 2:17 PM
తాడేపల్లి: కడప స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష జరిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, స్పెషల్ సీఎస్ కరికాల వల్లవన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్న సంస్థల వివరాలను అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్ఆర్ స్టీల్ కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను సైతం వివరించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఆయా సంస్థలు చేసిన ప్రతిపాదనలపై చర్చలు జరపాలని సూచించారు.