విద్యాశాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న విద్యాశాఖపై స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి ప్రభుత్వ సలహాదారు (విద్యాశాఖ) ఆలూరు సాంబశివారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగార్జున యాదవ్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి. సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ (పాఠశాల మౌలికసదుపాయాలు) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం.మధుసూద‌నరెడ్డి, గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ డైరెక్టర్ డి.దేవానందరెడ్డి, నాడు నేడు టెక్నికల్‌ డైరెక్టర్‌ మనోహర రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...: 
నాడు–నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడవులోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.
నాడు నేడు తొలిదశలో పూర్తైన  స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలన్న సీఎం.
వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాసపెట్టి, వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన యాక్టివిటీస్‌ చేపట్టాలని ఆదేశం. 
 
విద్యాశాఖలో చేపడుతున్న మన బడి నాడు నేడుతో పాటు, వివిధ కార్యక్రమాల అమలు ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు. 
–    ఈ ఏడాది 8వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21 నుంచి ట్యాబులు పంపిణీ 
–    అన్ని ల్యాప్‌టాపుల్లో పిల్లల సందేహాలను తీర్చే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేశామన్న అధికారులు.
–  టీచర్లకూ ట్యాబులు పంపిణీ కార్యక్రమం బోధనలో మంచి మార్పులను తీసుకు వచ్చిందన్న అధికారులు. 
–    గత ఏడాది ట్యాబులు పొందిన టీచర్లు సగటున ప్రతి రోజూ 77 నిమిషాలు వినియోగిస్తున్నట్టు అధికారుల వెల్లడి.
–    అలాగే గత ఏడాది ట్యాబులు అందుకున్న విద్యార్థులు సగటున 67 నిమిషాలు ట్యాబులను పాఠ్యాంశాలను నేర్చుకునేందుకు వినియోగిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు.
–    కిందపడో మరే ఇతర కారణాల వల్లో డ్యామేజ్‌ అయిన దాదాపు 7వేల ట్యాబులను సీఎం ఆదేశాల మేరకు తిరిగి రీప్లేస్ చేశామని తెలిపిన అధికారులు.

–    డిసెంబరు మూడోవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఐఎఫ్‌పీ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తిచేయాలన్న సీఎం
-    డిసెంబర్‌ కల్లా ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ ఏర్పాటు పూర్తవుతుందన్న అధికారులు.
–    స్కూళ్లకు ఇంటర్‌నెట్‌ సదుపాయం ఏర్పాటుపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు.
–    అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయం కచ్చితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

నాడు– నేడు రెండో దశ పనులను సమీక్షించిన సీఎం.

–    రెండో దశలో నాడు– నేడు కింద రూ. 3,746.82 కోట్లు విలువైన పనులు చేపట్టనున్నట్టు తెలిపిన అధికారులు. 
–    నాడు –నేడు పనుల్లో భాగంగా 11 రకాల సదుపాయాలను కల్పిస్తున్న ప్రభుత్వం.

–    జూనియర్‌ కాలేజీల్లో కూడా చురుగ్గా నాడు – నేడు పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు.

–    ఇంగ్లిషు మాధ్యమాల్లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించిన అధికారులు.
–    మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకూ యూనిట్‌ పరీక్షల్లో 87శాతం మంది ఇంగ్లీషు మాధ్యమంలో పరీక్షలు రాస్తున్నారని వెల్లడి. 
–    మిగిలిన వారికి కూడా చేయూత నిచ్చి వారు కూడా ఇంగ్లిషు మాధ్యమంలో పరీక్షలు రాసేలా చూడాలన్న సీఎం. 
–    దేశం మొత్తంమీద సగటున 37.03 శాతం మంది మాత్రమే ఇంగ్లిషు మాధ్యమంలో పరీక్షలు రాస్తుంటే, ఏపీలో  84.11 శాతం మంది పరీక్షలు రాస్తున్నట్టుగా తెలిపిన అధికారులు.
-    మిగిలిన పిల్లలకు చేయూతనిచ్చి నూటికి నూరుశాతం పిల్లలు ఇంగ్లిషు మాధ్యంలో పరీక్షలు రాసేలా వారిని తయారు చేయాలన్న సీఎం.

–    టోఫెల్‌ శిక్షణపై ముఖ్యమంత్రికి వివరాలు అందించిన అధికారులు.
–    సీఎం ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఒక పీరియడ్‌ టోఫెల్‌పై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపిన అధికారులు. 

–    ఐబీ సిలబస్‌పై తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.
–    ఇప్పటికే వర్కింగ్‌ గ్రూపు సమావేశాలకు అధికారులు హాజరయ్యారని వెల్లడి.
–    ఫేజ్‌ –1లో భాగంగా పాఠ్యప్రణాళిక, అసెస్మెంట్, టీచర్‌ ట్రైనింగ్, ఇక్కడ అవసరాలను దష్టిలో పెట్టుకుని బోధన ప్రణాళిక, తదితర అంశాలపై అధ్యయనం జరుగుతుందని వెల్లడి.
–    ఐబీ నుంచి వచ్చే స్పెషలిస్టులు అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందిస్తారని వెల్లడి. ఐబీ బోధనా పద్దతులపై వచ్చే విద్యా సంవత్సరంలో టీచర్లకు శిక్షణ
–    వచ్చే ఏడాది ఐబీ బోధనపై టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు. 

–    వచ్చే విద్యాసంవత్సరం నుంచి 6వ తరగతి ఆ పైబడ్డ తరగతులకు ప్యూచర్‌ స్కిల్స్‌పై పాఠ్యాంశాల బోధన
–    పిల్లలకు ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ట్రైనింగ్‌  కోసం ఇంజినీరింగ్‌ కాలేజీలలో నైపుణ్యం ఉన్నవారి సేవలను వినియోగించుకోనున్న ప్రభుత్వం.
–    దీనికిగానూ వీరికి  స్టైఫండ్‌ చెల్లించనున్న ప్రభుత్వం.

–    వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆప్షన్ ఎంచుకున్న విద్యార్ధులకు జపనీస్, జర్మన్‌ లాంటి ఇతర విదేశీ భాషలను కూడా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం.
–    9, 10వ తరగతి విద్యార్థులు అదనపు ఆప్షన్‌గా జర్మన్, జపనీస్, ఫ్రెంచి, స్పానిష్‌ లాంటి భాషలను నేర్చుకునే అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం.
–    దీనివల్ల మరిన్ని విస్తారమైన అవకాశాలు పిల్లలకు లభిస్తాయన్న అధికారులు.
–    పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా యాప్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు.

–    విద్యాకానుకపైనా సీఎం సమీక్ష
–    మళ్లీ స్కూళ్లు తెరిచేలోగా విద్యాకానుక పంపిణీకి చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 –డ్రాప్‌ అవుట్స్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ సత్ఫలితాన్ని ఇచ్చాయన్న అధికారులు.
–    పదోతరగతి ఫెయిల్‌ అయిన వారి సహా1,49,515 మంది తిరిగి బడుల్లో చేరారని వెల్లడి.
–    పిల్లలను తిరిగి బడులకు పంపే ప్రక్రియలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని వెల్లడించిన అధికారులు.
–    దేశంలో నూటికి నూరుశాతం పిల్లలను బడికి పంపడంలో తొలి జిల్లాగా నంద్యాల రికార్డు సృష్టించిందని వెల్లడించిన అధికారులు.

 

Back to Top