తాడేపల్లి: విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మనబడి నాడు–నేడు’ పనులపై, స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్థుల హాజరుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నారు.