మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చిన్నారి లేఖపై స్పందించిన సీఎం వైయస్ జగన్
14 Sep 2019 3:00 PM
అమరావతి: ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు నుంచి వెలివేయడంతో కోడూరి పుష్ప అనే అమ్మాయి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని వైయస్ జగన్ ఆదేశించారు.
చిన్నారి లేఖలోని సారాంశం ఇలా ఉంది..తనతో స్కూలులో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారని చిన్నారి సీఎంకు లేఖ రాసింది. తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్గా తీసుకున్నారు.