కాసేపట్లో పులివెందుల బయల్దేరనున్న సీఎం వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో పులివెందులకు బయల్దేరనున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మామ, వైయ‌స్ భార‌తి తండ్రి డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు భాకారాపురంలోని వైయస్‌ఆర్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సంస్మరణ సభకు సీఎం వైయస్‌ జగన్‌ హాజరై గంగిరెడ్డికి నివాళులర్పించనున్నారు. పులివెందులకు చేరుకుని ఇక్కడ కార్యక్రమాల తర్వాత ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. 

Back to Top