మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్
03 Jan 2023 12:31 PM
రాజమండ్రి: రాజమహేంద్రవరంలో పింఛన్ వారోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి నుంచి రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్ నుంచి సాయి కృష్ణ థియేటర్, బీఈడీ కళాశాల, అప్సర థియేటర్, ఆజాద్ చౌక్, నందం గనిరాజు జంక్షన్, వై జంక్షన్ ల మీదుగా ఆర్ట్స్ కాలేజీ వరకు సీఎం వైయస్ జగన్ ర్యాలీగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. స్టాల్స్ను పరిశీలించారు. వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో ఫొటో దిగి వారితో మాట్లాడారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికపైకి చేరుకున్న సీఎం వైయస్ జగన్.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరికొద్దిసేపట్లో సీఎం వైయస్ జగన్ పెన్షన్ లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.