న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు కేంద్రమంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పలు కీలక అంశాలపై చర్చించారు. – విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చ. – విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపిన సీఎం. – సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్కారిడర్ ప్రాజెక్టులకు సమీపనుంచి ఈ రోడ్డు వెళ్తుందని తెలిపిన సీఎం. – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని తెలిపిన సీఎం. – విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని కోరిన సీఎం. – విజవాడ తూర్పు బైపాస్పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని కోరిన సీఎం. – సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్న సీఎం. – ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామన్న సీఎం. – వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తిచేసిన సీఎం. – కత్తిపూడి – ఒంగోలు కారిడర్లో భాగంగా ఎన్హెచ్–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని కోరిన సీఎం. – విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్బేస్ కారణంగా మళ్లీ ట్రాఫిక్జామ్స్ ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలంటూ విజ్ఞప్తిచేసిన ముఖ్యమంత్రి.