తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు (శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సీఎం ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించనున్నారు.