తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ బయల్దేరారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో వైయస్ జగన్ పాల్గొననున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం చేరుకున్న సీఎం.. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. శంషాబాద్ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి ముచ్చింతల్లోని శ్రీరామనగరం చేరుకుంటారు. శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి ఈరోజు రాత్రి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.